
సాక్షి, విజయవాడ : డీఎంకే పార్టీ అధినేత ఎమ్కే స్టాలిన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వైఎస్ జగన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మంచి జరగాలని కోరుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
మొదట తెలుగులో ‘అందరికీ నమస్కారం’ అంటూ ప్రజలను పలకరించిన ఆయన అనంతరం తమిళం, ఇంగ్లీషులో సైతం పలకరించారు. అంతకు కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, స్టాలిన్లు నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన తర్వాత కేసీఆర్తో కలిసి తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లారు. వీరికి జగన్ స్వయంగా పుష్ఫగుచ్ఛాలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు.