టీడీపీ పాలనలో విద్యుత్‌ రంగం నిర్వీర్యం | Minister Balineni Srinivasa Reddy Comments On TDP Government | Sakshi
Sakshi News home page

టీడీపీ పాలనలో విద్యుత్‌ రంగం నిర్వీర్యం

Dec 28 2019 1:32 PM | Updated on Dec 28 2019 1:39 PM

Minister Balineni Srinivasa Reddy Comments On TDP Government - Sakshi

సాక్షి, విజయవాడ: గత టీడీపీ పాలనలో విద్యుత్‌ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పీపీఏ లు ద్వారా తక్కువ ధరకు సోలార్ పవర్ వస్తున్న అధిక మొత్తం లో  కోట్ చేశారన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపు లేదని స్పష్టం చేశారు.  నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందించడమే ధ్యేయం అని పేర్కొన్నారు. రైతులకు పగటి పూట 9 గంటలు విద్యుత్‌ అందిస్తున్నామని వెల్లడించారు. దీని కోసం రూ.1700 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు రంగం 70వేల కోట్లు అప్పుల్లో ఉందని చెప్పారు.

ఏపీసీపీడీఎల్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని ఇంధన శాఖ సెక్రటరీ శ్రీకాంత్‌ తెలిపారు. పీపీఏలు తగ్గించుకుంటూ తక్కువ ధరకు విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement