కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
కడుపు నొప్పి భరించలేక రాధ(32) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బి.కొత్తకోట మండలకేంద్రంలోని బీసీ కాలనీలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.