పీఎస్లో వ్యక్తిని చితకబాదిన పోలీసులు | Man torched police in kovur police station in spsr nellore district | Sakshi
Sakshi News home page

పీఎస్లో వ్యక్తిని చితకబాదిన పోలీసులు

Nov 30 2014 9:07 AM | Updated on Oct 9 2018 5:39 PM

కేసు విచారణ కోసం పోలీసు స్టేషన్కు తీసుకువచ్చిన వ్యక్తిపై పోలీసులు లాఠీలతో తమ ప్రతాపాన్ని చూపారు.

నెల్లూరు:  కేసు విచారణ కోసం పోలీసు స్టేషన్కు తీసుకువచ్చిన వ్యక్తిపై పోలీసులు లాఠీలతో తమ ప్రతాపాన్ని చూపారు. దీంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. గాయపడిన వ్యక్తిని పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరు పోలీసుస్టేషన్లో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది.

అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కొవురు పట్టణంలో ఇటీవల చోరీ జరిగింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. విచారణ కోసం తీసుకువచ్చిన వ్యక్తిపై పోలీసులు తమ లాఠీలతో విచక్షణరహితంగా కొట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement