పిడుగుపాటుతో యువకుడి మృతి | man dies of high storm | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుతో యువకుడి మృతి

Sep 27 2015 3:36 PM | Updated on Sep 3 2017 10:05 AM

పిడుగుపాటుకు గురై గిరిజన యువకుడు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం పాలెం చెరువు వద్ద ఆదివారం జరిగింది.

ఆత్మకూరు రూరల్ (కర్నూలు): పిడుగుపాటుకు గురై గిరిజన యువకుడు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం పాలెం చెరువు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు.. మండలంలోని శివపురం చెంచుగూడానికి చెందిన పరుశురాం (18) పాలెం చెరువులో ఉంటున్న తన అక్క ఇంటికి వచ్చాడు.

ఈ క్రమంలో గ్రామ శివారులో ఉన్న బ్రిడ్జి వద్ద ఇద్దరు స్నేహితులతో కలిసి కూర్చొని ఉన్న సమయంలో.. ఉరుములతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలో బ్రిడ్జి పక్కన ఉన్న పరుశురాం తలపై పిడుగు పడటంతో.. అక్కడికక్కడే మృతిచెందగా.. మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement