ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ | Larry RTC bus collision | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

Nov 24 2013 4:28 AM | Updated on Sep 2 2017 12:54 AM

అదుపుతప్పిన లారీ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రామచంద్రపురం మండలం అంబికపల్లి అగ్రహారం వద్ద శనివారం

 ద్రాక్షారామ, న్యూస్‌లైన్ : అదుపుతప్పిన లారీ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రామచంద్రపురం మండలం అంబికపల్లి అగ్రహారం వద్ద శనివారం ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రయాణికులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కాకినాడ నుంచి రామచంద్రపురం వైపు వస్తోంది. అదే సమయంలో రామచంద్రపురం వైపు నుంచి కాకినాడకు వెళుతున్న సుద్ద లోడు లారీ అంబికపల్లి అగ్రహారం వద్దకు వచ్చేసరికి అదుపుతప్పింది. ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. బస్సులో ప్రయాణిస్తున్న 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108లో రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 
 క్షతగాత్రుల్లో యానాం, ద్రాక్షారామ, రామచంద్రపురం, కాకినాడ, ఆలమూరు మండలం గుమ్మిలేరు ప్రాంతాలకు చెందిన కె.గోపాలకృష్ణ, పి.ఉదయప్రవీణ , టీఎస్ దీక్షితులు, పిల్లి సత్యనారాయణ, సలాది శ్రీరామారావు, వడ్డీ గంగారావు, శీలమంతుల రాఘవ, శీలమంతుల రాంబాబు, పెచ్చెట్టి సర్వేసు. డి.రాజేష్, సూరంపూడి లోవరాజు, లారీ డ్రైవర్ ముదిగొండ యాదయ్య ఉన్నారు. వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. రామచంద్రపురం సీఐ ఎం.వెంకటేశ్వర్లు క్షతగాత్రుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. రామచంద్రపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement