జూపూడి, చెంగల మధ్య ముగిసిన వివాదం | Jupudi prabhakara rao gives privilege motion notice against mlc chengal rayudu | Sakshi
Sakshi News home page

జూపూడి, చెంగల మధ్య ముగిసిన వివాదం

Sep 5 2014 11:37 AM | Updated on Sep 2 2017 12:55 PM

జూపూడి, చెంగల మధ్య ముగిసిన వివాదం

జూపూడి, చెంగల మధ్య ముగిసిన వివాదం

ఎమ్మెల్సీ చెంగల్రాయుడు, జూపూడి ప్రభాకరరావుల మధ్య వివాదం ఎట్టకేలకు ముగిసింది.

హైదరాబాద్ : ఎమ్మెల్సీ చెంగల్రాయుడు, జూపూడి ప్రభాకరరావుల మధ్య వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటన అంశంపై శాసనమండలిలో మాట్లాడుతున్న తనను చెంగల్రాయుడు దూషించి అవమానపరిచారంటూ శుక్రవారం ఉదయం జూపూడి ఛైర్మన్ పోడియం ముందు బైఠాయించి నిరసనకు దిగారు.

 

దాంతో తన వ్యాఖ్యలు జూపూడికి బాధకలిగించి ఉంటే ఉపసంహరించుకుంటున్నట్లు చెంగల్రాయుడు  తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిల్ ఛైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ చెంగల్రాయుడు వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లలేదన్నారు. మరోవైపు చెంగల్రాయుడిపై జూపూడి సభా హక్కుల నోటీసు ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement