భార్యపై పెట్రొల్‌ పోసి నిప్పెట్టిన భర్త..! | ‍husband kills his wife with petrol | Sakshi
Sakshi News home page

భార్యపై పెట్రొల్‌ పోసి నిప్పెట్టిన భర్త..!

Mar 13 2017 7:50 PM | Updated on Aug 24 2018 2:36 PM

ఎన్నిసార్లు చెప్పినా ప్రవర్తన మార్చుకోలేదని ఓ భర్త తన భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పటించాడు.

గుంటూరు: ఎన్నిసార్లు చెప్పినా భార్య తీరు మారలేదని ఆగ్రహించిన ఓ భర్త.. పక్కా స్కెచ్‌ వేసి ఆమెను అంతం చేశాడు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండల కేంద్రం నెహ్రూ నగర్‌ కాలనీలో ఈ ఘటన చోటుచెసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాలనీకి చెందిన కాకుమాను సుధాకర్‌, అరుణ(28) దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా వారి మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి.  సోమవారం  పొలం పని చేస్తున్న వారిద్దరూ గొడవ పడ్డారు.

ఈ నేపథ్యంలో సుధాకర్‌ భార్యను కర్రతో తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు అపస్మారక స్థితికి చేరిన భార్యపై అప్పటికే సిద్ధంగా ఉంచిన పెట్రోలు పోసి నిప్పంటించాడు. అనంతరం నేరుగా గ్రామంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన భార్యను చంపేశానని పోలీసులకు చెప్పాడు. దీంతో వెంటనే పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement