వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మహాత్ముడికి నివాళులు
సాక్షి, హైదరాబాద్: జాతి పిత మహాత్మాగాంధీ వర్థంతిని పురస్కరించుకుని మంగళవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. పార్టీ నేతలు ఎన్.లక్ష్మీపార్వతి, వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్ నాగిరెడ్డి, ఆర్.జగన్నాథం, చల్లా మధుసూదనరెడ్డి, డాక్టర్ ప్రపుల్లరెడ్డి, ఇ.రాజశేఖర్, దేవేందర్తో సహా పలువురు గాంధీ చిత్ర పటం వద్ద పూలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.