గండికోట, మైలవరానికి శ్రీశైలం నీరు | Gandikota, Srisailam water mailavaraniki | Sakshi
Sakshi News home page

గండికోట, మైలవరానికి శ్రీశైలం నీరు

Sep 15 2014 2:31 AM | Updated on Sep 27 2018 5:46 PM

గండికోట, మైలవరానికి శ్రీశైలం నీరు - Sakshi

గండికోట, మైలవరానికి శ్రీశైలం నీరు

జమ్మలమడుగు: గండికోట, మైలవరం జలాశయాలకు కృష్ణా నీరు రానుంది. మైలవరం జలాశయంలో డెడ్‌స్టోరేజ్‌కు చేరుకుంది. మరోవైపు వర్షాభావ పరిస్థితులు నెకలొన్నాయి.

జమ్మలమడుగు:
 గండికోట, మైలవరం జలాశయాలకు  కృష్ణా నీరు రానుంది. మైలవరం జలాశయంలో డెడ్‌స్టోరేజ్‌కు చేరుకుంది. మరోవైపు వర్షాభావ పరిస్థితులు నెకలొన్నాయి. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మున్సిపాలిటి కౌన్సిల్ సమావేశంలో శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు గండికోట, మైలవరానికి విడుదల చేయాలని కోరుతూ తీర్మానించిన కాపీని కలెక్టర్‌కు నివేదిక రూపంలో పంపారు.  
 గండికోటకు 5,
 మైలవరానికి మూడు టీఎంసీలు
 గండికోట జలాశయంలో ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేసి మునక గ్రామాల ప్రజలకు నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది గండికోటలో మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసిన సంగతి విదితమే. ఆ నీటిని సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకున్నారు. ప్రస్తుతం రెండు ప్రాజెక్టుల్లో నీరు డెట్ స్టోరేజీకి చేరుకుంది. మైలవరం జలాశయం నుంచి జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం ప్రజలకు సీపీడబ్ల్యూ స్కీం కింద సురక్షిత మంచినీటిని అందిస్తున్నారు. భారీ వర్షాలు పడి జలాశయంలోకి నీరు వచ్చి చేరితే తప్ప ప్రజలకు తాగునీరు అందే పరిస్థితి లేదు. పెన్నానది కిందనున్న బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో తాగునీటి అవసరాల కోసం మైలవరం జలాశయంపైనే ఆధారపడాల్సి వస్తోంది.
 
 అవుకు చేరుకున్న కృష్ణా జలాలు
 శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పోతితిరెడ్డి హెడ్‌రెగ్యులేటర్ ద్వారా అవుకు ప్రాజెక్టుకు చేరుకున్నాయి. ప్రతి రోజు శ్రీశైలం నుంచి ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని వద ల చేస్తున్నారు. అవుకు జలాశయంలో 1.3 మీటర్ల నీటి మట్టం వచ్చి చేరిన తర్వాత  గాలేరు-నగరి వరద కాలువ ద్వారా నీటిని వదలనున్నారు. మరో మూడ్రోజుల్లో జలాశయం నుంచి అధికారులు వరద కాలువ ద్వారా గండికోటకు నీటిని వదిలే ఆవకాశాలు ఉన్నట్లు సమాచారం.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement