వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
ముమ్మిడివరం: తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలోని ఓ వస్త్ర దుకాణంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మంటలు అంటుకుని ప్రమాదానికి దారి తీసింది. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.40 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పెద్ద మొత్తంలో సరుకు నిల్వ చేయడంతో నష్టం భారీగా ఉన్నట్టు తెలుస్తోంది.