అగ్నిప్రమాదంలో చిన్నారుల సజీవదహనం | fire accident in guntur district edlapadu two child burned | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో చిన్నారుల సజీవదహనం

Jan 31 2017 8:15 AM | Updated on Jul 11 2019 5:12 PM

అగ్నిప్రమాదంలో చిన్నారుల సజీవదహనం - Sakshi

అగ్నిప్రమాదంలో చిన్నారుల సజీవదహనం

గుంటూరుజిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సజీవదహనమయ్యారు.

గుంటూరు : గుంటూరుజిల్లా యడ్లపాడులో విషాదం చోటుచేసుకుంది. ఇల్లు దగ్ధమైన సంఘటనలో ఇద్దరు బాలికలు సజీవ దహనమయ్యారు.

యడ్లపాడు గ్రామంలోని ఎర్రచెరువు ప్రాంతంలో ఖమ్మంపాటి రోశమ్మ, కల్పాల నాగమణి అనే మహిళలు వారి ఇద్దరి పిల్లలతో పూరిళ్లలో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మంటలు వ్యాపించడంతో రెండు ఇళ‍్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇళ‍్లలో  నిద్రిస్తున్న రోశమ్మ కుమార్తె బేబి(8), నాగమణి కుమార్తె కోకిల(3)లు సజీవదహనమయ్యారు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. షార్ట్‌ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement