⇒ రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్కు కమిటీ సిఫార్సు
⇒ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, పుష్పా శ్రీవాణి ధ్వజం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మె ల్యే ఆర్కే రోజాను మరో ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేయడం అత్యంత దురదృష్టకరమైన విషయమని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ నిర్ణయం ప్రివిలేజ్ కమిటీ గౌరవాన్ని దిగజారుస్తుందన్నారు. కక్షసాధింపు, రాజ కీయ వ్యతిరేకతతో చేసిన సిఫార్సులుగా ప్రజ లు భావిస్తున్నారన్నారు. సంవత్సరం నాలుగు నెలలపాటు ఆమె సస్పెన్షన్ పూర్తయ్యాక మరోసారి ఏడాదిపాటు పొడిగించాలనే సిఫార్సులు ఇంత ఆలస్యంగా రావడం దురుద్దేశ పూరితమైనవన్నారు.
విజయవాడ వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కాల్మనీ సెక్స్ రాకెట్ విషయంలో ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఆ కేసులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లున్నాయి. ఇవన్నీ గతంలో సభలో చర్చకు రాబోతున్న సమయంలో ఎమ్మెల్యే రోజా గొంతునొక్కాలనే ఉద్దేశంతో ఏడాదిపాటు సస్పెన్షన్ వేటేశారు. ఆమెను ఎదుర్కొనే ధైర్యంలేక పిరికి పందల్లాగా మరో ఏడాది సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీన్ని తక్షణమే విరమించు కోవాలి’’ అని సూచించారు. ప్రివిలేజ్ కమిటీ ముందు విచారం వ్యక్తం చేసినా మనస్ఫూర్తి గా విచారం వ్యక్తం చేయలేదని కమిటీ చెప్పడం దారుణమన్నారు.
ఎమ్మెల్యే రోజా చేసిన తప్పేంటి?
ఎమ్మెల్యే రోజా చేయని తప్పునకు 14 నెలలపాటు శిక్ష అనుభవించారని, అసలామె చేసిన తప్పేంటని కురుపాం ఎమ్మెల్యే పుష్పా శ్రీవాణి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘టీడీపీ ప్రభుత్వంలో తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విచక్షణారహితంగా దాడి చేయడాన్ని ఖండించినందుకా? ర్యాగిం గ్కు బలైపోయిన రిషితేశ్వరి కుటుంబానికి అండగా ఉన్నందుకా? ‘కాల్మనీ సెక్స్రాకెట్’ విషయంలో మహిళలపై చేసిన దారుణాల గురించి ప్రశ్నించినందుకా? వైజాగ్లో బీచ్ ఫెస్టివల్లో బికినీషోలు అడ్డుకున్నందుకా? ఎందుకు? మరో ఏడాది సస్పెండ్ చేయాలని చూస్తున్నారు?’’ అని ప్రభుత్వాన్ని నిలదీ శారు. మహిళా ఎమ్మెల్యేను చూసి బాబు ఇంతగా భయపడతారని అనుకోలేదన్నారు.
దిగజారిన ప్రివిలేజ్ కమిటీ గౌరవం
Published Sun, Mar 19 2017 2:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement