'కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు కాదు' | Sakshi
Sakshi News home page

'కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు కాదు'

Published Mon, Sep 1 2014 2:33 PM

'కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు కాదు' - Sakshi

హైదరాబాద్: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ఇంజనీరింగ్ లో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఎంసెట్ కౌన్సెలింగ్ అనేది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు.

రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించినంత మాత్రానా కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు కాదన్నారు. మేనేజ్మెంట్ సీట్ల కోటా భర్తీ ఏపీ ఉన్నత విద్యా మండలి పరిరక్షణలో జరుగుతుందన్నారు. షెడ్యూల్ ప్రకారం అన్ని కౌన్సెలింగులు తామే నిర్వహిస్తామని ఆయన తెలిపారు

Advertisement

తప్పక చదవండి

Advertisement