
సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రతా లేకుండాపోయింది. మొన్న దాచేపల్లి, నేడు గుంటూరు.. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ఆడపిల్లల ఫిర్యాదులను చాలా తేలికగా తీసుకుంటున్నారు పోలీసులు. ప్రేమ పేరుతో ఓ ఆకతాయి తమను వేధిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇద్దరు అక్కాచెల్లెలు ధర్మవరం పోలీసులను సంప్రదించారు. శాంతినగర్కు చెందిన ఓబులేష్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో తమ వెంటపడి వేధిస్తున్నాడని తెలిపారు.
అయితే ఆ ఆడపిల్లలకు ధైర్యం చెప్పి, వారి ఫిర్యాదు స్వీకరించకుండా, కేసు నమోదు చేసుకోకుండా పోలీసులు విచిత్రంగా ఉచిత సలహాలు ఇచ్చారు. ఆ యువకుడు కనిపిస్తే మాకు ఫోన్ చేసి చెప్పండి అంటూ హేళన చేస్తూ.. మాట్లాడారు. దీంతో పోలీసుల తీరుపై విద్యార్థి, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఒక వైపు ఆడపిల్లలపై రోజుకో దారుణం చోటుచేసుకుంటుంటే, పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని వారు తప్పు పడుతున్నారు.