డీజీపీ దినేష్ రెడ్డి పదవీకాలంపై విచారణ వాయిదా | Sakshi
Sakshi News home page

డీజీపీ దినేష్ రెడ్డి పదవీకాలంపై విచారణ వాయిదా

Published Mon, Sep 23 2013 11:59 AM

డీజీపీ దినేష్ రెడ్డి పదవీకాలంపై విచారణ వాయిదా

హైదరాబాద్ : డీజీపీ దినేష్ రెడ్డి పదవీకాలం పొడిగింపు పిటిషన్పై విచారణ  వాయిదా పడింది. విచారణను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) బుధవారానికి వాయిదా వేసింది. ఎల్లుండికల్లా దినేష్ రెడ్డి పదవీకాలం పొడిగిపుపై ప్రభుత్వం... క్యాట్కు సమాచారం ఇవ్వనుంది. అంతకు ముందు ప్రభుత్వ న్యాయవాది... ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నందున దినేష్ రెడ్డి పదవీకాలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. డీజీపీగా దినేష్రెడ్డి కొనసాగింపుపై ఈనెల 23వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని క్యాట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement