డోన్టౌన్: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక అబద్ధాలతో ముఖ్యంత్రి చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. డోన్లోని ఆయన స్వగృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆ మాటకు కట్టుబడి ఉండలేక కట్టుకథలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళలను మరింత దారుణంగా మోసం చేసిన ఘనతను చంద్రబాబు మూటగట్టుకున్నారని ఆరోపించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నేడు ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారన్నారు.
ఇక నిరుద్యోగ భృతి 1.75 లక్షల ఇళ్లకు ఇవ్వాల్సి ఉందని, అయితే ఆ ప్రస్తావనే ముఖ్యమంత్రి తీసుకరావడం లేదని విమర్శించారు. రైతుల పై వడ్డీ భారం మోపడమే కాకుండా, ఇన్పుట్ సబ్సిడీని కూడా వర్తింపజేయకుండా వ్యవస్థనే నిర్వీర్యం చేశారని ఆరోపించారు. జీవో నంబర్ ఎంస్ 13ను ను రాద్ధాంతం చేసిన టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అదే జీవోను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు.
పోలవరం ప్రాజెక్టు కార్యాలయ, ఇతర అవసరాల నిమిత్తం కేంద్రం 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే, దాన్ని కూడా తప్పుబట్టి నిధులు లేనట్లు ప్రజల ముందు డ్రామా ఆడటం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇక పట్టిసీమ ప్రాజెక్టు ఎత్తిపోతల నిర్మాణం.. అవినీతికి నిలయంగా మారడం ఖాయమన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వివాదం ముదిరి రైతుల ఆందోళన ఉద్ధృతంగా మారకముందే ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు.
స్వతంత్ర రాజకీయాలే మాకు తెలుసు..:
రావుబహుదూర్ శేషారెడ్డి స్వతంత్రంగానే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ఆ నాడు డోన్, వెల్దుర్తి, బేతంచెర్ల, ప్యాపిలి మండలాలు మాత్రమే నియోజకవర్గంగా ఉండేదన్నారు. ఇటీవల అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తనకు కానీ, తన కుటుంబానికి ఎక్కడా కూడా టీడీపీ సభ్యత్వం లేదన్నారు. తాను వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో కాంగ్రెస్లో చేరానని, నేడు జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానన్నారు. తనను ఎన్నికల ముందు మూడేళ్ల క్రితమే అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారన్నారు. ప్రజల ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానన్నారు.
1978లో కాంగ్రెస్ పార్టీలో పెద్దమనిషిగా ప్రస్తుత ఉపముఖ్యమంతి కేఈ క్రిష్ణమూర్తి, తదుపరి 1985లో విబేధాలు తలెత్తడంతో తెలుగునాడు పార్టీ పెట్టడం, ఆ తరువాత ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ కోసం విబేధాలు పొడచూపిన వాస్తవాలు ప్రజలకు తెలుసన్నారు. వాటిని కాదని నిజాయితీ గల రాజకీయాల పై విమర్శించడం పెద్ద మనుషుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. డోన్ పట్టణంలో నత్తనడకన నడుస్తున్న ఫ్లై ఓవర్ పనులను పురోగతిలో తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నానన్నారు.
ఇక పక్షపాత ధోరణితో ఎంపిక చేసిన జన్మభూమి కమిటీలపై కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు. అనంతరం ప్యాపిలి మండలంలో బూర్గుల గ్రామంలో గడ్డి వామి దగ్ధమై నష్టపోయిన రైతు ఓబులేసుకు రూ. 5వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు,మాజీ ఎంపీపీ రామక్రిష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు వలసలరామక్రిష్ణ,వ్యక్తిగత సహాయకులు అంకిరెడ్డి,మాజీ సర్పంచ్ మల్లెంపల్లె రామచంద్రుడు,కోట్రాయి వెంకటేశ్వర్రెడ్డి, బోరెడ్డి శ్రీరామిరెడ్డి, మెట్టుపల్లె వెంకటేశ్వర్రెడ్డి, మల్లికార్జునరెడ్డి,గార్లదిన్నె రామసుబ్బయ్య, ఎస్టీ సెల్ జిల్లాకార్యదర్శి శివ, తిరుపతయ్య, మైనార్టీ నాయకులు రఫి, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
అబద్ధాలతో కాలయాపన
Published Mon, Mar 16 2015 3:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement