శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి బీచ్ వద్ద గురువారం ఉదయం ఓ మృతదేహం లభ్యమైంది.
అక్కుపల్లి బీచ్ వద్ద మృతదేహం లభ్యం
Nov 26 2015 9:07 AM | Updated on Sep 3 2017 1:04 PM
వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి బీచ్ వద్ద గురువారం ఉదయం ఓ మృతదేహం లభ్యమైంది.మృతుడు వజ్రపుకొత్తూరు మండలకేంద్రానికి చెందిన అప్పలస్వామి(67) అనే రిటైర్డ్ టీచర్గా గుర్తించారు. మూడు రోజుల నుంచి కనిపించటం లేదని కుటుంబసభ్యులు వజ్రపుకొత్తూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అప్పలస్వామి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


