-
తీరంలో ‘అల’జడి
సాక్షి, వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం): ‘అల’కల్లోలం.. తీరంలో భయం భయం .. ముందుకు వచ్చిన సముద్రం.. కోతకు గురవుతున్న రక్షణ గోడలు.. ఇదీ అక్కుపల్లి శివసాగర్ తీరంలో పరిస్థితి.. గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. కోస్తాంధ్రకు ఆవల ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతూ గంటకు 30– 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు చేశారు. బంగాళాఖాతంలో రెండు రోజులుగా అలజడి మొదలైంది. అధికారుల హెచ్చరికలకు మించి పరిస్థితి భయాందోళనగా మారింది. దీని ప్రభావంతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆదివారం వేకువజామున అక్కుపల్లి శివసాగర్ తీరంలో సముద్రం సుమారు 140 మీటర్లు ముందుకు వచ్చింది. దీంతో తీరంలో ఉన్న ఇసుక దిబ్బలు, బీచ్లో నిర్మించిన రక్షణ గోడ కోతకు గురైంది. ఎన్నడూ లేనివిధంగా సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులు భయందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు వేటకు విరా మం ఉండటంతో కేవలం ఇళ్లకే పరిమితమయ్యారు. వేట నిషేధాన్ని రెండు రోజుల క్రితమే ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఎంతో ఆశతో మత్స్యకారులు చేపల వేటకు సిద్ధం అవుతున్న తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అలజడిని చూసి వారు భయాందోళన చెందుతున్నారు. భయానక వాతావరణం గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కుపల్లి, నువ్వలరేవు, గుణుపల్లి తీరాలలో సముద్రం ముందుకు వచ్చిందని మత్స్యకారులు తెలిపారు. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ గాలులు వీయడంతోపాటు ఇలా సముద్రం ఒక్కసారిగా ముందుకు రావడంతో భయం వేస్తుందని వారు భయాందోళన చెందారు. అయితే రాత్రి సమయంలో పరిస్థితి మరింతగా భీకరంగా మారితే ప్రమాదం తప్పదని వారు వాపోతున్నారు. ఇప్పటికే వేట చేసేందు కు సిద్ధంగా ఉన్న తరుణంలో గంగమ్మ తల్లి ఉప్పొంగడం పట్ల వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వేట లేక ఇబ్బందులు పడ్డామని ఇక వేట సాగించుకోనే సమయం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్న తరుణంలో సముద్రంలో అలజడి తమను కలవరపెట్టిందన్నారు. ప్రాణభయంతో పరుగులు సముద్రం వేకువజామున ముందుకు వచ్చింది. మరోసారి ఉదయం 9 గంటల సమయంలో ముందుకు రావడంతో మత్స్యకారులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. అక్కుపల్లి శివసాగర్ బీచ్లో ఇప్పటికే కోటి రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. వీటికి రక్షణగా సిమెంట్, రాళ్లతో రక్షణ గోడ నిర్మించారు. అలలు ఉధృతంగా ఎగసి పడుతూ నీరు ముందుకు రావడంతో నిర్మాణాలు కొట్టుకుపోయి రాళ్లు తేలిపోయాయి. కాగా మరికొద్ది దూరంలో పడవలను సురక్షితంగా ఉంచారు. సముద్రపు నీరు వాటిని తాకి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అయితే సముద్రం కొద్ది దూరంలో ఆగిపోవడంతో మత్స్యకారులు ఊపిరి పీల్చుకున్నారు. -
అక్కుపల్లి బీచ్ వద్ద మృతదేహం లభ్యం
వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి బీచ్ వద్ద గురువారం ఉదయం ఓ మృతదేహం లభ్యమైంది.మృతుడు వజ్రపుకొత్తూరు మండలకేంద్రానికి చెందిన అప్పలస్వామి(67) అనే రిటైర్డ్ టీచర్గా గుర్తించారు. మూడు రోజుల నుంచి కనిపించటం లేదని కుటుంబసభ్యులు వజ్రపుకొత్తూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అప్పలస్వామి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement