'పూర్తిస్థాయి కేటాయింపులకు మరికొంత సమయం' | cs mohanty meets employees unions | Sakshi
Sakshi News home page

'పూర్తిస్థాయి కేటాయింపులకు మరికొంత సమయం'

May 30 2014 6:51 PM | Updated on Jun 2 2018 4:41 PM

'పూర్తిస్థాయి కేటాయింపులకు మరికొంత సమయం' - Sakshi

'పూర్తిస్థాయి కేటాయింపులకు మరికొంత సమయం'

ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపుల అంశం ప్రస్తుతానికి తాత్కాలిక ప్రతిపదికనే జరుగుతున్నట్లు సీఎస్ మహంతి స్పష్టం చేశారు.

హైదరాబాద్: త్వరలో కొత్తగా ఏర్పడబోవు ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగుల కేటాయింపులు ప్రస్తుతానికి తాత్కాలిక ప్రతిపదికనే జరుగుతున్నట్లు సీఎస్ మహంతి స్పష్టం చేశారు. ఈ రోజు ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయిన అనంతంర ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికనే ఉద్యోగుల కేటాయింపు జరిగిందని.. మూడునెలలపాటు ఈ కేటాయింపుల ప్రకారమే పనిచేయాలని తెలిపారు. ఇది శాశ్వత కేటాయింపు కాదని, పూర్తిస్థాయి కేటాయింపుకు కొంత సమయం పడుతుందన్నారు. వివాదాల పరిష్కారానికి గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జూన్‌ 2 నుంచి 9 వరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫైళ్లు,  ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ జరుగుతుందన్నారు

 

.జూన్‌1 వ తేదీ రాత్రి ఉద్యోగుల విభజన లిస్ట్‌ వెబ్‌సైట్‌లో పెడతామన్నారు. ఉద్యోగుల విభజన నాలుగు దశల్లో జరుగుతుందని..మొదటి దశలో ఐఏఎస్ ల కేటాయింపు, రెండో దశలో సచివాలయ, శాఖాధిపతుల పోస్టుల కేటాయింపు జరుగుతుందని మహంతి తెలిపారు.మూడో దశలో స్టేట్‌ కేడర్‌ పోస్టుల విభజన, నాలుగో దశలో జోనల్‌ పోస్టుల విభజన జరుగుతుందన్నారు. రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాక..ఆ ప్రభుత్వాల అవగాహన మేరకు ఉద్యోగుల సర్ధుబాటు జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement