ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని జెన్నారంలో శనివారం చోటుచేసుకుంది. కలిసి జీవించలేక, కలిసి మరణించాలని ఆ ప్రేమజంట నిర్ణయించుకుంది.
ఆదిలాబాద్: ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని జెన్నారంలో శనివారం చోటుచేసుకుంది. కలిసి జీవించలేక, కలిసి మరణించాలని ఆ ప్రేమజంట నిర్ణయించుకుంది. దీంతో వారిద్దరూ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిద్దరి పరిస్థితి విషమించడంతో లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ ప్రేమజంట మృతిచెందినట్టు తెలుస్తోంది. మృతులు వనజ(16), రంజిత్(20)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కరీంనగర్ సారంగాపూర్ మండలం మంగల వాసులుగా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు.
వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడం చేతనే ఈ అఘాయిత్యానికి పాల్పడివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.