Corona Cases in Andhra Pradesh: Today 161 New Positive Cases Are Reported in AP, Last 24 Hours, District Wise List - Sakshi Telugu
Sakshi News home page

ఏపీలో 3588కి చేరిన కరోనా కేసులు

Published Sat, Jun 6 2020 1:18 PM

Coronavirus Cases Rises To 3588 In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో శనివారం కొత్తగా 161 కరోనా  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3588కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో(శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు) 12,771 పరీక్షలు నిర్వహించగా 161 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా నుంచి ఇవాళ కొత్తగా 29 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,323కు చేరింది. కరోనా వైరస్‌తో ఇప్పటివరకు రాష్ట్రంలో 73 మంది మరణించారు. రాష్ట్రంలో  ప్రస్తుతం 1192 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
(24 గంటల్లో 9887 కేసులు.. 294 మరణాలు)

Advertisement
Advertisement