జిల్లాలకు ఎపీసీసీ పరిశీలకుల నియామకం

జిల్లాలకు ఎపీసీసీ పరిశీలకుల నియామకం - Sakshi

హైదరాబాద్‌: స్థానిక సంస్థలకు జరిగే ఉప ఎన్నికల్లో పరిశీలకులను నియమించడానికి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మార్చి 17న  ఇందిరాభవన్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌. రఘువీరారెడ్డి పార్టీ సీనియర్‌ నాయకులతో సమావేశమయ్యారు.



ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించిన విషయాలపై చర్చించారు. త్వరలో జరగనున్న మున్సిపల్‌/కార్పొరేషన్‌, వార్డుల ఉప ఎన్నికలకు పార్టీ పరిశీలకులుగా కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలు, వాటి పరిశీలకుల వివరాలను ఓ ప్రకటనలో ఏపీసీసీ వెల్లడించింది.

 

జిల్లా పేరు                             పరిశీలకులు

 

1. విజయనగరం       ---          ద్రోణం రాజు శ్రీనివాస్‌(ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే)

2. విశాఖపట్నం       ---            ఎస్‌.ఎన్‌.రాజా (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి)

3. తూర్పు గోదావరి    ---        పక్కాల సూరిబాబు (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి)

4. పశ్చిమ గోదావరి    ---        నరహరశెట్టి నరసింహారావు(ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి)

5. కృష్ణా                ----         సుందరరామ శర్మ (ఎపీసీసీ లీగల్‌ సెల్‌ చైర్మన్‌)

6. గుంటూరు         ----           కె. బాపిరాజు (ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ)

7. నెల్లూరు           -----            మస్తాన్‌వలీ (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే)

8. చిత్తూరు          ------           డాక్టర్‌ సాకె శైలజానాధ్‌ (ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి)

9. కడప              -----             షాజహన్‌ బాషా (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే)

10. కర్నూలు       -----             డాక్టర్‌ ఎన్‌. తులసిరెడ్డి ( ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ)

11. అనంతపురం   ------        అహ్మదుల్లా ( ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి)

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top