కాఫీ తోటలు నాశనమైపోయాయి: అశోక్ | coffee gardens ruined, says ashok gajapathi raju | Sakshi
Sakshi News home page

కాఫీ తోటలు నాశనమైపోయాయి: అశోక్

Oct 18 2014 12:57 PM | Updated on Sep 2 2017 3:03 PM

హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్రలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.

హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్రలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ఈ నష్టాన్ని అంచనా వేసి, పరిహారం ఇచ్చేందుకు రాష్ట్రానికి ఓ బృందాన్ని పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని తాము కోరినట్లు ఆయన చెప్పారు.

గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటలు పూర్తిగా నాశనం అయిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోడానికి కేంద్రం నుంచి వీలైనంత సాయం చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement