గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్‌ | CM YS Jagan Meets Governor ESL Narasimhan At Vijayawada | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్‌

Jun 13 2019 5:37 PM | Updated on Jun 13 2019 7:18 PM

CM YS Jagan Meets Governor ESL Narasimhan At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : ఎన్నికలు ముగిసిన తర్వాత కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ రేపు (శుక్రవారం) ప్రసంగించనున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ విధానాలపై ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో నగరంలోని గేట్‌వే హోటల్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఐదేళ్ల కాలంలో చేపట్టబోయే అభివృద్ధి పనులు, అవలంభించే విధానాలపై గవర్నర్‌ ప్రసంగం ఉండనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement