గురుదాసుపురం పంచాయతీ సాయినగర్కు చెందిన ఆటోడ్రై వర్ సొర్ర భీమారావు గురువారం రంగోయిలో సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు.
పలాస రూరల్ : గురుదాసుపురం పంచాయతీ సాయినగర్కు చెందిన ఆటోడ్రై వర్ సొర్ర భీమారావు గురువారం రంగోయిలో సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తనకు అధికారులు అన్యాయం చేశారని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. న్యాయం చేయూలని డిమాండ్ చేశాడు. రెవెన్యూ శాఖాధికారులు అన్యాయం చే శారని ఆరోపించాడు. దీంతో రెవెన్యూ, పోలీసు అధికారులు దిగొచ్చి బాధితుడికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో సెల్టవర్ నుంచి దిగాడు. వివరాలు...భీమారావు కొన్నాళ్లుగా అండమాన్ వలసపోరుు అతని చెల్లెలు వై.కాంతమ్మకు తన భూమి వ్యవహారాలను చూడమని చెప్పగా ఆమె తన పేరు మీద పట్టాలు రారుుంచుకొని స్వాధీనపరుచుకుంది. దీంతో ఆయన కోర్టులో కేసు వేశాడు.
కోర్టు తీర్పు ఇటీవల చెల్లెలుకు అనుకూలంగా వచ్చింది. దీంతో ఇరువురి మధ్య గొడవలు జరిగారుు. న్యాయం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి చివరకు గురువారం రంగోరుులోని సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఆత్మహత్యకు ప్రయత్నించగా భార్య తన భర్తను రక్షించాలని, న్యాయం చేయూలని విలపించింది. సంఘటనా స్థలానికి కాశీబుగ్గ ఎస్ఐ బి.శ్రీరామమూర్తి తన సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది చేరుకొని బాధితునికి సెల్ఫోన్ ద్వారా నచ్చజెప్పినా వినలేదు. ఆర్డీవో వస్తే తప్ప దిగనని మొండికేశాడు. మందస తహశీల్దార్ శివబ్రహ్మానందం, ఆర్ఐ శివాజీపట్నాయక్ అక్కడకు చేరుకొని బతిమిలాడినా ప్రయోజనం లేకుండా పోరుుంది.
టెక్కలి ఆర్డీవో ఎం.విశ్వేశ్వరరావు, కాశీబుగ్గ డీఎస్పీ ఎం.దేవప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని సెల్ఫోన్ ద్వారా న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో కిందకు దిగాడు. జరిగిన విషయూన్ని ఆర్డీవోకు వివరించాడు. ఆర్డీవో సమక్షంలో ఒప్పంద పత్రం రాసుకొని బాధితునికి 1.50 ఎకరాలు, అతని చెల్లెలకు 50 సెంట్లు భూమి అప్పగిస్తామని సంతకాలు చేశారు. వారితో పాటు కాశీబుగ్గ సీఐ వై.రామకష్ణ పలాస ఆర్ఐ రవి ఉన్నారు. బాధితుడిని ఆర్డీవో కార్యాలయూనికి శుక్రవారం రావాలని సూచించారు. అధికారులు తప్పు చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని ఆర్డీవో చెప్పారు. సెల్టవర్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు.