సీతానగరం మండలం కాశీపేట వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామభద్రపురం మం డలం ఆరికతోట
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
Feb 10 2014 2:54 AM | Updated on Jul 12 2019 3:02 PM
సీతానగరం/బొబ్బిలి రూరల్, న్యూస్లైన్ : సీతానగరం మండలం కాశీపేట వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామభద్రపురం మం డలం ఆరికతోట గ్రామానికి చెందిన జక్కు చంద్రశేఖర్(3) మృతి చెందాడు. ఆరికతోట నుంచి మామయ్య సింహాచ లం, తల్లి, అన్నతో కలసి చంద్రశేఖర్ ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. సీతానగరం మండలం నిడగళ్లుకు వీరు వెళ్తున్నారు. కాశీపేట వద్ద ఎడ్లబండిని వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో చంద్రశేఖర్ రోడ్డుపై తుళ్లిపోయి, తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే బాలుడిని 108 వాహనంలో బొబ్బిలి సీహెచ్సీకి తరలించారు. వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. బాలుడిని విశాఖ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. బాలుడి తండ్రి సురేష్ రామగుండంలోని ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. సీతానగరం ఎస్సై ఆర్.వాసుదేవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement