ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఈసెట్)- 2016ను సోమవారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ఆచార్య పీఆర్ భానుమూర్తి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
-ప్రిలిమినరీ ‘కీ’ని ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం ఈసెట్ వెబ్సైట్లో ఉంచుతారు.
-మే 16న ఫలితాలతో పాటు ఫైనల్ ‘కీ’ విడుదల చేసే అవకాశముంది.
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఈసెట్)- 2016ను సోమవారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ఆచార్య పీఆర్ భానుమూర్తి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు ప్రాంతీయ కేంద్రాల పరిధిలోని 68 కేంద్రాలలో పరీక్ష ఉంటుందని వెల్లడించారు.
అనంతపురంలో 6, కాకినాడలో 16, విజయవాడలో 14, తిరుపతిలో 9, విశాఖపట్నంలో 13, గుంటూరులో 8, విజయనగరంలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 36,809 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. జేఎన్టీయూ (అనంతపురం)లో సోమవారం ఉదయం ఆరు గంటలకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య హెచ్. వరదరాజన్ పరీక్ష సెట్ కోడ్ను విడుదల చేస్తారని వెల్లడించారు.