లారీ ఢీకొని వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Published Tue, Sep 1 2015 8:11 AM

a man died in a road accident

ఆలమూరు(తూర్పుగోదావరి జిల్లా):  రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడిక గ్రామ సమీపంలో జాతీయరహదారిపై జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సత్యనారాయణ(31) రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement