ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పుట్లూరు : ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చాలవేముల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చాలవేముల గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి(45) తన ఇంట్లోనే ఉరి వేసుకుని తనువు చాలించాడు.
కాగా మృతుడు వెంకట రమణారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.