అనంతపురం జిల్లా పెనుకొండలోని సాయికాళేశ్వర్ ఆశ్రమం గోడకూలిన ఘటనలో 5 మందికి గాయాలయ్యాయి.
పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండలోని సాయికాళేశ్వర్ ఆశ్రమం గోడకూలిన ఘటనలో 5 మందికి గాయాలయ్యాయి. ఆశ్రమానికి పక్కనే ఉన్న పాంచ్బీబీ దర్గా వద్దకు మంగళవారం ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. దర్గాకు ఆనుకుని సాయి కాళేశ్వర్ ఆశ్రమం 14 అడుగుల ఎత్తై గోడ ఉంది. అది మంగళవారం ఉదయం ఒక్కసారిగా కూలింది. గోడ కూలి షెడ్డుపై పడటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. గోడకు ఆనుకుని ఉన్న షెడ్డులో సుమారు 500 మంది భక్తులు ఉన్నారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.