మూడు వాహనాలు ఢీ..ఇద్దరు మృతి | 2dies in 2severly injured in road accident in guntur district | Sakshi
Sakshi News home page

మూడు వాహనాలు ఢీ..ఇద్దరు మృతి

Aug 25 2015 7:31 AM | Updated on Aug 30 2018 3:56 PM

గుంటూరు జిల్లా నర్సారావుపేట మండలం లక్ష్మీపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

గుంటూరు: గుంటూరు జిల్లా నర్సారావుపేట మండలం లక్ష్మీపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన ఓ గ్యాస్ ట్యాంకర్ ఢీకొంది. అదే సమయంలో కర్నూలు నుంచి ఉల్లిపాయల లోడుతో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి వెళుతున్న లారీ గ్యాస్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉల్లిపాయల లారీలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

మృతులను పశ్చిమగోదావరి జిల్లా పెద్దవేగి మండలం చక్రాయిగూడెం గ్రామానికి చెందిన క్లీనర్ మహేశ్(20), కర్నూలు జిల్లా నందవరం మండలం జగ్గాపురం గ్రామానికి చెందిన ఉల్లిపాయల రైతు బోగి వీరాస్వామి (55)గా గుర్తించారు. గాయపడిన డ్రైవర్ ప్రసాద్, వీరన్నను చికిత్స కోసం నర్సారావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement