బస్సు ప్రమాదంలో 25 మందికి గాయాలు
జగ్గయ్యపేట: కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ఎల్వీఆర్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం సదరు ట్రావెల్స్ బస్సును మరో రెండు బస్సులు వెనుకనుంచి ఢీకొట్టాయి. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా, 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడ, జగ్గయ్యపేట ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.