సఖినేటిపల్లి/ మలికిపురం :కోనసీమ గుండెల్లో గుబులు కొనసాగుతూనే ఉంది. కలుగుల్లోని కాల సర్పాల్లా.. అంతటా పరుచుకుని ఉన్న చమురు, సహజవాయువుల పైపులైన్ల ‘బుసబుసలు’ ఆ గడ్డ చెవుల్లో కఠోరంగా మార్మోగుతూనే ఉన్నాయి. ఆ బుసబుసలు శాశ్వతంగా సద్దుమణగాలని, కాలయముని క్రోధాగ్ని లాంటి కీలలు మరోసారి తమ సీమలో రగలరాదని కోనసీమవాసులు గాఢంగా కోరుతున్నారు. నగరం గ్రామంలో 22 మందిని పొట్టన పెట్టుకున్న గెయిల్ ప్రధాన పైపులైన్ విస్ఫోటం అనంతరం కొంత కాలం గ్యాస్ ఉత్పత్తి, సరఫరా నిలిపి వేశారు. కోనసీమలో 300కి పైగా బావులుండగా ప్రస్తుతం మోరి జీసీఎస్ పరిధిలోని 30 బావుల్లో గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. విస్ఫోటం అనంతరమూ పలు చోట్ల గ్యాస్ లీక్ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
ఉత్పత్తి నిలిపివేసిన బావుల్లో ఒత్తిడి కారణంగా లీకవుతున్నాయి. బావుల క్యాప్లు శిథిలస్థితికి చేరడంతో బావి నుంచి వచ్చే గ్యాస్ ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నాయి. బావుల నుంచి గ్యాస్ సరఫరా అవుతున్న చోట పైపులైన్లు శిథిలావస్థకు చేరడం వల్ల లీకేజీలు సంభవిస్తున్నాయి. అలాగే చమురు బావులు, పైపులైన్ల లీకేజీ సంఘనలు కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి. నగరం పైప్లైన్ విస్ఫోటం అనంతరం కేశనపల్లి, మోరి, అడవిపాలెం, తాటిపాక జీసీఎస్ల పరిధిలో సుమారు ఆరు ప్రాంతాల్లో గ్యాస్, ఆయిల్ లీకేజీ సంఘటనలు జరిగాయి. పలు చోట్ల ఇవి తక్కువస్థాయికే పరిమితమయ్యాయి.
మరో ఘోరం జరక్క ముందే మేలుకోండి..
కోనసీమ ఎన్నటికీ మరిచిపోలేని పీడకలలాంటి నగరం విస్ఫోటం అనంతరం కూడా ఓఎన్జీసీ అధికారులు ఈ ప్రాంత ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బావుల పర్యవేక్షణ సరిగా ఉండడం లేదని, వెల్ క్యాప్లు, ఇతర పరికరాలు, పైపులైన్లు శిథిలస్థితికి చేరాయని, అయినా వాటిని తక్షణం మార్చే పూనిక కానరావడం లేదని స్థానికులు వాపోతున్నారు. జరగరానిది మరోసారి జరగకముందే.. ఓఎన్జీసీతో పాటు ప్రభుత్వాధికారులూ మేలుకోవాలంటున్నారు. కంటికి కునుకును, మనసుకు నిశ్చింతనూ కరువు చేస్తున్న లీకేజీలను వెంటనే అరికట్టాలని, శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నిశ్చింతకు నోచేదెన్నడు?
Published Sun, Jan 4 2015 1:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement