వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లి వద్ద శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
Dec 11 2015 9:48 AM | Updated on Aug 30 2018 3:56 PM
మైదుకూరు: వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లి వద్ద శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మైదుకూరు మండలం సోమయాజుల పల్లెకు చెందిన సీర్ల శివ(23) ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైదుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement