Three-language
-
ఇది తప్పనిసరి.. సీబీఎస్ఈ కీలక నిర్ణయం
ఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026-27 విద్యా సంవత్సరం నుంచి 9,10 తరగతుల భాషా విధానంలో కీలక మార్పులను ప్రకటించింది. 9,10 తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ ఏడాది(2026) జూలై నుంచి త్రిభాషా విధానం అమలు చేయనుంది. మూడో భాషగా విదేశీ భాషను ఎంచుకునే అవకాశాన్ని సీబీఎస్ఈ కల్పించింది.సీబీఎస్ఈ అనుబంధ స్కూళ్ల అన్నింటికి సర్క్యూలర్ జారీ చేసింది. చదివే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. విద్యార్థుల భాషా నైపుణ్యం పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఎన్సీఈఆర్టీ 9, 10 తరగతుల సిలబస్ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.ప్రస్తుత విద్యా సంవత్సరం ఇప్పటికే ఏప్రిల్ 2026లో ప్రారంభమైనప్పటికీ, దీని అమలు కోసం ఒక తాత్కాలిక మార్పు విధానాన్ని అనుసరిస్తామని సీబీఎస్ఈ పేర్కొంది. ఈ సవరించిన భాషా విధానం ప్రకారం.. విదేశీ భాషను చదవాలనుకునే విద్యార్థులు.. వారు ఎంచుకునే మిగిలిన రెండు భాషలు కచ్చితంగా భారతీయ దేశీయ భాషలైనప్పుడు మాత్రమే దాన్ని ఎంచుకోవడానికి వీలుంటుంది. లేదా విదేశీ భాషలను అదనపు నాలుగో భాషగా కూడా చదువుకోవచ్చని బోర్డు తెలిపింది. -
త్రిభాషా సూత్రాన్ని అంగీకరించం
చెన్నై: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)–2020లో కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులోని ఏఐఏడీఎంకే ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో అమలవుతున్న ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ‘ఎన్ఈపీలోని త్రిభాషా సూత్రం బాధాకరం, విచారకరం. ప్రధాని మోదీ ఈ విధానాన్ని పునఃసమీక్షించాలి’అని సీఎం పళనిస్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ద్విభాషా విధానం నుంచి వైదొలిగేది లేదని స్పష్టం చేశారు. ద్విభాషా విధానాన్నే కొనసాగించాలంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. కేంద్రం చెబుతున్న త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ఎప్పటికీ ఆమోదించబోదని కుండబద్దలు కొట్టారు. 5వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరపాలని ఎన్ఈపీ ప్రతిపాదించింది. అయితే, హిందీ, సంస్కృతాలను తమపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు. -
త్రిభాషా చిత్రంలో...
ఇది రానాకి సవాల్లాంటి సీజన్ అనాలి. ఎందుకంటే ఒకే సారి మూడు ద్విభాషా చిత్రాల్లో నటిస్తున్నారు. ‘బాహుబలి: ది కన్క్లూజ్’ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఘాజి’ తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. త్వరలో ఆరంభం కానున్న ‘1945’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఇప్పుడు ఏకంగా ఓ త్రిభాషా చిత్రంలో నటించడానికి అంగీకరించారు. మేజర్ రవి దర్శకత్వంలో మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. మేజర్ మహదేవన్ అనే పాత్ర చుట్టూ తిరిగే ‘కీర్తిచక్ర’, ‘కురుక్షేత్ర’, ‘కాందహార్’ వంటి వార్ మూవీస్ తీసిన మేజర్ రవి ఇప్పుడు ఇదే పాత్రతో తాజా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గత మూడు చిత్రాల్లోనూ మేజర్ మహదేవన్గా మోహన్లాల్ నటించారు. నాలుగో చిత్రంలోనూ ఈ పాత్రను ఆయనే చేయనున్నారు. మరో కీలక పాత్రకు రానాను తీసుకున్నారు. ఇందులో రానా లెఫ్టినెంట్ చిన్మయ్ పాత్రలో కనిపిస్తారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల మొదలవుతుంది.


