amezan
-
పాసవ్వాలా... ఫెయిలవ్వాలా... అంతా పైసల పైనే
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ఎగ్జామ్ సిరీస్ ఒకటి. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.ఓ కుటుంబం బావుండాలన్నా, ఓ ఊరు బావుండాలన్నా లేదా దేశం బావుండాలన్నా చదువుకుని ఉండాలి. నేటి సమాజంలో మనం సజావుగా బతకాలి అంటే భాష ఏ విధంగా అవసరమో అదే విధంగా చదువు కూడా అంతే అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. కానీ ఇప్పటి పరిస్థితులలో చదువుకునేవారు తక్కువయ్యారు... చదువు కొనేవారు ఎక్కువయ్యారు. రాత్రింబవళ్ళూ కష్టపడి చదివి పరీక్ష రాస్తే, కష్టపడని కొందరు దొడ్డిదారిన అసలైన వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో అల్లుకున్న కథతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన సిరీస్ ‘ఎగ్జామ్’. ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ 7 భాగాలతో లభ్యమవుతోంది. దాదాపుగా వాస్తవిక ఘటనలతో, చిన్నపాటి సినిమాటిక్ లిబర్టీతో ఓ నిజమైన సమస్యను మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు సర్గుణమ్. ఈ సిరీస్ మొత్తం గ్రిప్పింగ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. కథాంశానికి వస్తే... తమిళనాడు లోని తైకారా ప్రాంతానికి కొత్తగా ఎంపికైన డీఎస్పీ మారుమల్లి ఛార్జి తీసుకోవడానికి తన కారులో బయలుదేరుతుంది. దారిలో మారుమల్లిని ఝాన్సీ కిడ్నాప్ చేసి తైకారాకు తాను డీఎస్పీగా వెళుతుంది. ఓ డీఎస్పీ స్థాయి వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ తన స్థానంలో వెళ్ళడమనేది సినిమాటిక్ లిబర్టీ అనుకున్నా కాస్త ఎక్కువైందని చెప్పవచ్చు. కాకపోతే ఇక అక్కడి నుండి మెల్ల మెల్లగా కథలోకి తీసుకువెళతారు దర్శకుడు. అసలు మారుమిల్లిని ఝాన్సీ ఎందుకు కిడ్నాప్ చేసింది? స్టేషన్కి చేరుకున్న ఝాన్సీని ఎవరైనా గుర్తుపట్టారా? లేదా అన్న అంశాలను మాత్రం సిరీస్లోనే చూడాలి. ఈ సిరీస్ మొత్తం అయిపోయాక మన విద్యా వ్యవస్థలో ఉన్న చీకటి కోణాలు స్పష్టంగా అర్థం అవుతాయి. ఒక దశలో ఏ ఎగ్జామ్ అయినా పాసవ్వాలా... ఫెయిలవ్వాలా అన్నది తామిచ్చే పైసల మీదే ఆధారపడుతుందన్న విషయం తెలుస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ చూసి తెలుసుకోవాల్సిన సిరీస్ ఇది. – హరికృష్ణ ఇంటూరు -
షాపర్స్ స్టాప్లో అమెజాన్ పెట్టుబడులు
సాక్షి, ముంబై: ప్రముఖ ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ ఇండియా, మరో రీటైల్ మేజర్ షాపర్స్ స్టాప్లో వాటాలను కొనుగోలు చేసింది. ఈ మేరకు షాపర్స్ స్టాప్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం అమెజాన్ రూ.179 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. షాపర్స్ స్టాప్లో 5 శాతం వాటాను అమెజాన్ కొనుగోలు చేయనుంది. రూ. 179.26 కోట్ల విలువైన వాటాను షాపర్స్ స్టాప్ అమెజాన్కు విక్రయించనుంది. ఈ నేపథ్యంలో ఎన్బీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ చెందిన షేర్లను ప్రిఫెరెన్షియల్ బేసిస్ కింద అమెజాన్కు కేటాయించనుంది. మరోవైపు అమెజాన్ ఇండియాలో తమ ఉత్పత్తులను విక్రయించడానికి వాణిజ్యపరమైన ఒప్పందం కుదుర్చుకున్నామని షాపర్స్ స్టాప్ ఇటీవల బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. దీంతో అధికారిక వెబ్సైట్లతో పాటు, ఇకపై అమెజాన్లో కూడా తమ ఉత్పత్తులు ప్రత్యేకంగా లభ్యంకానున్నాయని తెలిపింది. మొత్తం పోర్ట్ఫోలియో జాబితాలో 500 బ్రాండ్లు అమెజాన్ మార్కెట్ లో లభ్యం కానున్నాయి. అలాగే షాపర్స్ స్టాప్ లిమిటెడ్ కూడాతన ఫిజికల్ నెట్వర్క్లో ఫ్యాషన్ కోసం ప్రత్యేకమైన అమెజాన్ అనుభవ కేంద్రాలను సృష్టిస్తుందని ఫైలింగ్లో తెలిపింది. భారత్లో అభివృద్ధి చెందుతున్న కస్టమర్ బేస్ను మరింత పెంచుకోవడానికి ఇద్దరు భాగస్వాములు ఒకరిబలాన్ని మరొకరు పెంచుకోనున్నామని అమెజాన్ ఇండియా ఫాషన్ బిజినెస్ హెడ్ అరుణ్ సర్ దేశ్ముఖ్ వెల్లడించారు. -
అమెజాన్ గోదాము వద్ద కార్మికుల ధర్నా
కొత్తూరు: మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని అమెజాన్ కంపెనీ గోదాము ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. జీతాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సకాలంలో వేతనాలు చెల్లించాలని, నిబంధనల ప్రకారం జీతాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ దిగి వచ్చి కార్మికులతో చర్చలు జరిపి, యాజమాన్యంతో చర్చించి న్యాయం చేస్తానని హామి ఇచ్చారు.


