వైరల్‌: ట్రాక్టర్‌తో నిమిషాల్లో పాలు పితికాడు..

ముంబై: ఓ రైతు ఇంజనీర్‌లా వినూత్న ఆలోచన చేశాడు. చేతులకు పని చెప్పకుండానే ట్రాక్టర్‌తో చిటికెలో ఆవు పాలు పితికిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను మహీంద్రా గ్రూప్‌ అధినేత‌ ఆనంద్ మహీంద్ర బుధవారం ట్విటర్‌లో‌ పంచుకున్నారు. ‘గ్రామాల్లో మా ట్రాక్టర్‌లను మల్టీ టాస్క్‌లుగా ఉపయోగిస్తున్న వీడియోలను ప్రజలు నాకు తరచు పంపిస్తున్నారు. అందులో ఇది నాకు కొత్తగా అనిపించింది. ఇంజనీర్‌ కానీవారు ఇలా చేయగలరా’ అంటూ ఈ వీడియోను షేర్‌ చేశారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top