నిజాలు నిరూపించగలిగే రూపంలో ఈ సినిమా ఉండబోతోంది | Sakshi
Sakshi News home page

నిజాలు నిరూపించగలిగే రూపంలో ఈ సినిమా ఉండబోతోంది

Published Fri, Oct 19 2018 6:42 PM

స్వర్గ లోకంలో ఉన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, దివంగత సీఎం ఎన్‌. తారక రామారావు ఆశీస్సులు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’సినిమాపైనే ఉంటాయని వివాదస్పద డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ అభిప్రాయపడ్డారు. నిజాలు నిరూపించగలిగే రూపంలో ఈ సినిమా ఉండబోతోందని స్పష్టం చేశారు. తిరపతిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో దివంగత ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ పార్వతి, చిత్ర నిర్మాత రాకేష్‌ రెడ్డి, జీవీ ఫిలిమ్స్‌ బ్యానర్‌ అధినేత బాలగిరి, చిత్ర యూనిట్‌తో  కలిసి హాజరైన ఆయన అనంతరం సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.