బలవంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ భూములను లాక్కోవడంపట్ల ఓ రైతు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. 40 ఏళ్లుగా బంధం పెనవేసుకుపోయిన తమ భూములను వదిలి ఎక్కడికి వెళ్లిపోవాలన్న ఆలోచనతో గత రెండు నెలల నుంచి కంటికి నిద్ర, కడుపునిండా భోజనం కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా విజయవాడ సీఆర్ డీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ధర్నాలో ఆ రైతు మాట్లాడుతూ ఇది తనొక్కడి ఆందోళనే కాదని, ప్రతి ఒక్కరి ఆందోళన అని చెప్పారు.
Aug 26 2015 12:23 PM | Updated on Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement