యువతి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన శుక్రవారం కర్నూలు జిల్లా కేంద్రంలోని స్టాంటన్పురంలో కలకలం రేపింది. స్థానికంగా కుటుంబంతో కలిసి నివసిస్తోన్న సుచరిత (24) తలకు తుపాకి గురిపెట్టుకుని కాల్చుకుంది. బుల్లెట్ శబ్ధం విన్న కుటుంబసభ్యులు పరుగున రాగా, సుచరిత అప్పటికే రక్తపుమడుగులో పడిఉంది.