ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఏలూరులో దుర్గా ప్రసాద్ ఆత్మహత్యాయత్నం మరువక ముందే మరో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రత్యేక హోదా కల్పించాలంటూ రామిశెట్టి లక్ష్మయ్య(55) అనే వ్యక్తి గురువారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా వేదాయపాళెంలోని కేశవోలు నగర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లక్ష్మయ్య ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వద్ద సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక హోదా కోసం తాను చనిపోతున్నట్లు లక్ష్మయ్య సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Aug 27 2015 11:12 AM | Updated on Mar 21 2024 8:17 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement