రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీం కేసులో కీలక పరిణామాలకు రంగం సిద్ధమవుతున్నది. గ్యాంగ్స్టర్ నయీంతో అంటకాగి.. అతని అక్రమాల్లో భాగమైన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులపై వేటు వేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలి పొలిటికల్ వికెట్ దీపావళి తర్వాత పడనుందని అత్యంత విశ్వనీసయ సమాచారం. నయీంతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగొండ టీఆర్ఎస్ నేత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావుపై మొట్టమొదటగా వేటు పడనుందని తెలుస్తోంది. ఆయనను పదవీ నుంచి తప్పించాలని టీఆర్ఎస్ అధిష్ఠాన వర్గం నిర్ణయించింది.
Oct 27 2016 1:50 PM | Updated on Mar 21 2024 6:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement