ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన శుక్రవారం రాజమండ్రిలోని గోదావరి పుష్కర ఘాట్లను బోటులో ప్రయాణిస్తూ పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రయాణిస్తున్న బోటును మరో బోటు ప్రమాదవశాత్తూ ఢీకొంది. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా బోటులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, నారాయణ ప్రయాణిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు గోదావరి పుష్కరాలు శనివారంతో ముగియనున్న విషయం తెలిసిందే.
Jul 24 2015 1:24 PM | Updated on Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement