తమ పారితోషికాలకు పన్ను చెల్లించి వైట్ మనీగా చేయండని టాప్ నాయికలు నయనతార,అనుష్కలు నిర్మాతలపై వత్తిడి చేస్తున్నారన్న ప్రచారం కోడంబాక్కంలో హల్చల్ చేస్తోంది.ఇది ప్రధాని నరేంద్రమోది పెద్ద నోటుల రద్దు నిర్ణయం ఫెక్టే.తమిళం,తెలుగు,మలయాళం,కన్నడం మొదలగు దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ పొజిషన్ ఉండి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లు 10 మంది వరకూ ఉంటారు.ఇకటి రెండు చిత్రాలలో నటించి మార్కెట్ను కోల్పోయిన వారు 50 మంది వరకూ ఉంటారు.ఇక ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్లు పారీతోషికం విజయాలను బట్టి చిత్ర చిత్రానికి పెరుగుతుండటం తెలిసిందే.కాగా నటి నయనతార,అనుష్కల పారితోషికం మాత్రం నానాటికీ పెరగడమే గానీ తరగడం అంటూ జరగలేదు.ముఖ్యంగా నయనతార గురించి చెప్పాలంటే ప్రారంభ దశలో ఆమె పారితోషికం 20 లక్షలు మాత్రమే.