ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీతో రాజ్యాంగానికి ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీతో రాజ్యాంగానికి ప్రమాదం

Dec 29 2025 8:05 AM | Updated on Dec 29 2025 8:05 AM

ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీతో రాజ్యాంగానికి ప్రమాదం

ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీతో రాజ్యాంగానికి ప్రమాదం

మదనపల్లె : దేశ అత్యున్నత రాజ్యాంగానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వల్ల ప్రమాదం ఏర్పడిందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మదనపల్లిలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు హాజరైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌, సీపీఐ సెంట్రల్‌ కంట్రోల్‌ కమిషన్‌ చెర్మన్‌ డాక్టర్‌ కె.నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య మాట్లాడారు. దేశ సంపదను కార్పొరేట్‌ ముసుగు వేసుకున్న దోపిడిదారులకు అప్పగిస్తున్నారని, సహజ వనరులు నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే ఆదివాసులను ఆపరేషన్‌ కగార్‌ పేరుతో బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని అన్నారు. ఆపరేషన్‌ కగార్‌ కేవలం కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాల కోసమే అన్నారు. ప్రకృతి సంపదను అదానీకి దోచి పెట్టడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. దేశ స్వాతంత్య్రం కోసం సీపీఐ నేతలు ఎన్నో నిర్బంధాలు, కుట్ర కేసులు ఎదుర్కొన్నారని, ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారని వివరించారు. మోడీ ప్రభుత్వం ప్రజల ఆహారపు అలవాట్ల పైన, ధరించే దుస్తులపైన ఆంక్షలు విధిస్తూ, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతోందన్నారు. హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రశ్నిస్తే అర్బన్‌ నక్సలైట్లని ముద్ర వేస్తారా

సహజ సంపదను కొల్లగొట్టడానికే

ఆపరేషన్‌ కగార్‌

మదనపల్లె సదస్సులో మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌, సిపిఐ సెంట్రల్‌

కంట్రోల్‌ కమీషన్‌ చెర్మన్‌ నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement