అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల దాడులు | - | Sakshi
Sakshi News home page

అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల దాడులు

Jul 7 2025 6:30 AM | Updated on Jul 7 2025 6:30 AM

అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల దాడులు

అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల దాడులు

కడప అర్బన్‌ : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌.పి ఈ.జి. అశోక్‌ కుమార్‌ హెచ్చరించారు. జిల్లాలో గత 15 రోజుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై జిల్లా పోలీస్‌ శాఖ జరిపిన దాడుల వివరాలను ఆయన వెల్లడించారు.

● జిల్లాలో గత 15 రోజుల్లో జూదమాడుతున్న మొత్తం 159 మందిని అరెస్టు చేసి రూ. 2,85,645 నగదు స్వాధీనం చేసుకుని 22 కేసులు నమోదు చేశామన్నారు. 9 మట్కా కేసులు నమోదు చేసి మొత్తం 16 మందిని అరెస్టు చేసి రూ. 50,570 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

● జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసి 1.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రెండు కేసులు నమోదు చేశామన్నారు.

● జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై పోలీస్‌ సిబ్బంది గస్తీ తిరుగుతూ ముమ్మర దాడులు నిర్వహించి 986 మందిపై కేసులు నమోదు చేశారన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 57 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.

● జిల్లాలో కోడి పందేల కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేసి రూ. 5,050 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

● అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి మొత్తం 3 కేసులు నమోదు చేసి 13.24 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

● అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనకు పోలీస్‌ శాఖకు ప్రజలు సహకరించాలని, మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌, ఇతర నేరాలకు సంబంధించిన సమాచారాన్ని డయల్‌ 112 కు తెలియజేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement