
అపురూపం.. అమ్మదర్శనం
యాదగిరిగుట్ట: ఆలయాలు శరన్నవరాత్రి ఉత్సవాలతో శోభాయమానంగా అలరారుతున్నాయి. నాలుగో రోజు బుధవారం అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి అనుబంధంగా ఉన్న శివాలయంలో అమ్మవారు శ్రీపర్వతవర్థిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి ప్రాతఃకాల పూజ, అర్చనలు, పారాయణాలు, శ్రీదేవి జపాలు, సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం నవావరణ పూజ, కుంకుమార్చన, నీరాజన మంత్ర పుష్పములు, తీర్థప్రసాద వినియోగం చేపట్టారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ రవినాయక్, అధికారులు పాల్గొన్నారు.
శ్రీపర్వతవర్థిని దేవి అలంకరణలోదర్శనమిస్తున దుర్గామాత