
త్యాగాల ఫలమే తెలంగాణ
యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరి క్షేత్రానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సుమారు 35 వేల మంది దర్శించుకున్నారు.
వాతావరణం
పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.
- IIIలో
మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025
- IIలో
అన్ని వర్గాల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కలసికట్టుగా సాగుదాం. నిరంతరం శ్రమించి యాదాద్రి భువనగిరి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుపుదాం.
– శాసనమండలి
చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
●
అమరుల ఆశయ సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన
ఫ తెలంగాణను ప్రపంచస్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిరంతర కృషి
ఫ సమన్వయంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుదాం
ఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
ఫ కలెక్టరేట్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
సాక్షి, యాదాద్రి: ఎన్నో ఏళ్ల పోరాటాలు, ఎంతోమంది త్యాగాల ఫలితంగానే స్వరాష్ట్ర కల సాకారమైందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. అనేక దశల్లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. వారి ఆశయ సాధనకు అనుగుణంగా ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రపంచస్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్రెడ్డి నిరంతర కృషి చేస్తున్నారని తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి, మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న,కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంశ్ యాదవ్, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావుతో కలిసి పోలీసుల ఫ్లాగ్ మార్చ్ తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతిపై ప్రసంగించారు.
ప్రసంగంలోని ప్రధాన అంశాలు ఇవీ..
● మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు కోటి 30 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రూ.65.92 కోట్ల విలువగల ఉచిత ప్రయాణం.
● జిల్లాలో 1,25,910 మందికి గ్యాస్ సిలిండర్లు అందజేసి రూ.17.05 కోట్ల సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం.
● ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో 17 పెలట్ గ్రామాల్లో 762 మందికి ఇళ్లు మంజూరు. రెండో విడతలో 8,191 మందిని ఎంపిక.
● భూసమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టం తీసుకువచ్చాం. జిల్లాలో ఆత్మకూర్ (ఎం) మండలాని పైలట్ మండలంగా తీసుకొని రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. నేటి(మంగళవారం) నుంచి జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సుల నిర్వహణ.
● రైతుభరోసా పథకం కింద మొత్తం 1,88,526 మంది రైతులకు లబ్ధి. రూ.174.11 కోట్లు వారి ఖాతాల్లో జమ.
● యాసంగిలో 375 కొనుగోలు కేంద్రాల ద్వారా 39,846 మంది రైతుల నుంచి 3,51,361 మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేశాం. రూ.739 కోట్లు రైతుల ఖాతాల్లో జమ.
● 515 రేషన్ షాపుల ద్వారా 2,18,963 కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. ఈ ఏడాది మార్చి నుంచి నేటివరకు 1,915 నూతన కార్డులు మంజూరు.
● ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లు మంజూరు.
● బునాదిగాని , పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల ఆధునీకరణ పనులు ప్రారంభం.
● వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, కల్లుగీత, చేనేత, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు మొత్తం 99,402 మందికి నెలకు రూ. 24.88 కోట్ల పింఛన్.
● 10వ తరగతిలో గతంలో ఎన్నడూ లేని విధంవీ విద్యా సంవత్సరం ఉత్తమ ఫలితాల సాధన. రాష్ట్ర స్థాయిలో జిల్లా ఏడవ స్థానం.
● 428 గ్రామ పంచాయతీల్లోని 719 గ్రామీణ ఆవాసాలు, ఆరు మున్సిపాలిటీల్లో 1,56,147 ఇళ్లకు నల్లాల ద్వారా గ్రామీణ నీటి సరఫరా పఽథకం ద్వారా తాగునీటి సరఫరా. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ నీరు అందించేందుకు రూ.210 కోట్లతో పనులు జరుగుతున్నాయి.
● 6,771 చేనేత మగ్గాలు, 2,240 మర మగ్గాలకు జియో ట్యాగింగ్. నేతన్నకు బీమా పథకంలో 10,686 మంది చేనేత కార్మికులను చేర్పించాం.
● ఆలేరు పట్టణంలో రూ.11 కోట్ల వ్యయంతో రైల్వే అండర్ బ్రిడ్జి పనులు.
● నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా 16,676 సీసీ కెమెరాలు ఏర్పాటు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
వేడుకల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రేఖ, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, ఉద్యోగుల జేఏసీ నాయకుడు మందడి ఉపేందర్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ ప్రసాద్తో పాటు జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.
6న గంధమల్లకు శంకుస్థాపన
ఆలేరు నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గంధమల్ల ప్రాజెక్టు పనులకు ఈనెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 1.41 టీఎంసీల సామర్థ్యంతో ముంపు లేకుండా రూ.571 కోట్ల వ్యయంతో రిజర్వాయర్ నిర్మిస్తున్నాం. ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలో 56 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. 50 చెరువులను నింపడానికి వీలవుతుందన్నారు.
గౌరవ వందనం చేస్తున్న పోలీసులు
న్యూస్రీల్
తెలంగాణ రైజింగ్ విజన్తో ముందుకు
తెలంగాణ రైజింగ్–2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రైజింగ్ విజన్లో ప్రముఖంగా పేదల సంక్షేమం, సమగ్రపాలసీల రూపకల్పన, ప్రపంచస్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తుందని గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు.

త్యాగాల ఫలమే తెలంగాణ

త్యాగాల ఫలమే తెలంగాణ

త్యాగాల ఫలమే తెలంగాణ

త్యాగాల ఫలమే తెలంగాణ

త్యాగాల ఫలమే తెలంగాణ

త్యాగాల ఫలమే తెలంగాణ