
చదువుల దివ్వె.. సాయిమేఘన
ఫ టెన్త్, పాలిసెట్, టీజీఆర్జేసీలో రాష్ట్రస్థాయి ర్యాంకులు
రాజాపేట : పవర్లూమ్ నడుపుకుంటూ కూతురును చదివిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. వారి ఆశయాలకు అనుగుణంగానే విద్యనభ్యసిస్తూ ప్రతిభ కనబరుస్తోంది కూతురు. టెన్త్, టీజీఆర్జేసీ, పాలిసెట్.. ఇలా అన్నింటిలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది రాజాపేట మండలం రఘునాథపురానికి చెందిన గొట్టిపాముల సాయిమేఘన. ఇటీవల విడదలైన పాలిసెట్ ఫలితాల్లో సాయిమేఘన ఎంపీసీ విభాగంలో 24, ఎంబైపీసీలో 15వ ర్యాంక్ సాధించింది. టీజీఆర్జేసీలోనూ 22వ ర్యాంక్ కై వసం చేసుకుంది. గ్రామానికి చెందిన గొట్టిపాముల శ్రీనివాస్–శ్రీలత పవర్లూమ్ నడిపిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. పెద్ద కుమార్తె సాయిమేఘన 1నుంచి 4 వరకు స్థానిక ప్రాథమిక పాఠశాలలో, 5నుంచి 7వరకు బీబీనగర్లోని బీసీ గురుకులం, 8నుంచి 10వ తరగతి వరకు పటాన్చెర్వులోని ముత్తంగి ఎస్ఓయూ గురుకులంలో విద్యనభ్యసించింది.
టెన్త్లో 7వ ర్యాంక్ : పదవ తరగతి పరీక్ష ఫలి తాల్లోనూ 582 మార్కులు సాధించి రాష్టస్థాయిలో 7వ ర్యాంకు సాధించింది. టెన్త్, పాలిసెట్, టీజీ ఆర్జేసీలో ఉత్తమ ర్యాంకులు సాధించిన సాయిమేఘనను పలువురు అభినందించారు.